Saturday, May 18, 2024

కేజిఎఫ్ పై అనుచిత వ్యాఖ్యలు.. మరో రష్మికగా కాంతార స్టార్ కిషోర్..!

spot_img

కాంతారలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటించిన కిషోర్ కేజిఎఫ్ చిత్రంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తాజాగా కిషోర్ మాట్లాడుతూ.. ‘తానూ ఇంతవరకు కేజిఎఫ్ చూడలేదని.. అది తన వ్యక్తిగత ఛాయిస్’ అని చెప్పాడు. నేషనల్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిషోర్ మాట్లాడుతూ.. సినిమాపై తన అభిరుచి వేరుగా ఉంటుందని.. తీవ్రమైన సమస్యల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలంటే తనకి ఇష్టమని.. మైండ్‌లెస్ ఎంటర్‌టైనర్స్ తనకి నచ్చవని కాస్త కేజిఎఫ్ ని కించపరిచే విధంగా వ్యాఖ్యానించాడు. కేజీఎఫ్2కి బ్లాక్‌బస్టర్‌ కలెక్షన్స్ తో పాటు పాజిటివ్ రివ్యూస్ కూడా అందుకుంది. కేజిఎఫ్ ఫ్రాంచైస్ తో హీరో యశ్‌, దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు.

తొలిసారి కన్నడ చిత్ర పరిశ్రమ సత్తా ఏంటో దేశవ్యాప్తంగా సాటిచెప్పిన చిత్రం కేజిఎఫ్. అలాంటి చిత్రాన్ని ప్రశంసించకపోగా.. అవమానకరంగా కిషోర్ మాట్లాడాల్సి ఉండకూడదని అప్పుడే కన్నడ ఇండస్ట్రీ నుండి కామెంట్స్ వస్తున్నాయి. నటుడు కిషోర్ మాట్లాడుతూ.. ‘తప్పో ఒప్పో తెలియదు కానీ నేను కేజీఎఫ్2 చూడలేదు. ఇది నా తరహా సినిమా కాదు. ఇది నా పర్సనల్ చాయిస్. నేను మైండ్‌లెస్ మూవీ కంటే కూడా తీవ్రమైన కంటెంట్ కలిగి విజయం సాధించని చిన్న సినిమాని చూడాలనుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే కాంతారపై ఇలాంటి తలతిక్క వ్యాఖ్యలు చేసే తీవ్ర వివాదంలో ఇరుక్కుంది హీరోయిన్ రష్మిక. ఇంకా ఈమెపై ట్రోలింగ్ తగ్గటం లేదు. ఇలాంటి ఉదాహరణ మనముందు ఉండగానే మరి కిషోర్ చేసిన కామెంట్స్ పై కేజిఎఫ్, హీరో యష్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Latest News

More Articles