Friday, May 3, 2024

నీటి కోసం బిందెలో తలపెట్టి ఇరుక్కుపోయిన చిరుత

spot_img

మహారాష్ట్ర  అనుకోని ఘటన జరిగింది. అడవిలోంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుతకు ఊహించని పరిణామం ఎదురైంది. దాహం తీర్చుకునేందుకు ఓ బిందెలో తలపెట్టి అందులోనే ఇరుక్కుపోయింది. ఈ ఘటన ధూలే  జిల్లాలో నిన్న( ఆదివారం) జరిగింది.

ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత దాహంగా ఉండటంతో ఇంటి ఆవరణలో ఉన్న ఓ బిందెలోని నీటిని తాగేందుకు తలపెట్టింది. ఆ తర్వాత తలను బయటకు తీయలేకపోయింది. సుమారు ఐదు గంటల పాటు అలాగే ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించింది. గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు చాకచక్యంగా కట్టర్‌ సాయంతో బిందెను తొలగించారు.  ఆ తర్వాత చిరుతను బోనులో బంధించి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి విడిచిపెట్టారు.

ఇది కూడా చదవండి:ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

Latest News

More Articles