Saturday, May 11, 2024

ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో కేసీఆర్ సమావేశం

spot_img

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. దీంతో పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ( సోమవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపి నియోజకవర్గాల ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఖమ్మం, మహబూబాబాద్ కీలక నేతలు పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల కార్యచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. నిన్న( ఆదివారం) కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై నేతలతో అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి: మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో రెండు లోక్ సభ స్థానాల‌ను గెలుస్తాం

Latest News

More Articles