Saturday, April 27, 2024

నిజామాబాద్ జిల్లా జైలులో గుండెపోటుతో అండర్ ట్రయల్ ఖైదీ మృతి

spot_img

నిజామాబాద్ జిల్లా జైలులో అండర్ ట్రయల్ ఖైదీ తిరుమలయ్య ఇవాళ(సోమవారం) గుండెపోటుతో మృతి చెందాడు. గత ఏడు నెలలుగా నిజామాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం చద్మల్ గుట్ట ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంకు చెందిన తిరుమలయ్య (28) చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సోమవారం అతనికి గుండెపోటు రావడంతో తిరుమలయ్యను జైలు అధికారులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇది కూడా చదవండి:మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో రెండు లోక్ సభ స్థానాల‌ను గెలుస్తాం

Latest News

More Articles