Friday, May 17, 2024

భార‌త్‌-ఇంగ్లండ్ ఉప్ప‌ల్ టెస్టు: 20 వేల టిక్కెట్లు విక్ర‌యం

spot_img

హైద‌రాబాద్‌: ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు చెప్పారు. శుక్ర‌వారం ఉప్ప‌ల్ స్టేడియంలోని గ‌ణ‌ప‌తి ఆల‌యం, ప్ర‌ధాన పిచ్ వ‌ద్ద వేద పండితుల ఆధ్వ‌ర్యంలో అపెక్స్ కౌన్సిల్ స‌భ్యుల‌తో క‌లిసి జ‌గ‌న్‌మోహ‌న్‌రావు శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించారు.

Also Read.. జీతం విషయంలో యజమానితో వాగ్వాదం. ఉద్యోగి ఆత్మహత్య

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ.. తొలి టెస్టు మ్యాచ్‌కు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానుల నుంచి అనూహ్య స్పంద‌న వ‌స్తోంద‌ని చెప్పారు. ఇప్ప‌టికే దాదాపు 20 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముడ‌య్యాయ‌ని వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో స్టేడియం పూర్తి సామ‌ర్థ్యానికి త‌గ్గ‌ట్టు, ఎవ‌రికి ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిప‌దిక‌న చేస్తున్న‌ట్టు తెలిపారు.  

Latest News

More Articles