Friday, May 3, 2024

జీతం విషయంలో యజమానితో వాగ్వాదం. ఉద్యోగి ఆత్మహత్య

spot_img

ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యజమానితో గొడవ కారణంగా ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జీతం డబ్బుల విషయంలో ట్రాక్టర్ యజమాని దొడ్డ వెంకట కృష్ణారెడ్డి, ట్రాక్టర్ డ్రైవర్ నక్క మధు మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాక్టర్ యజమాని దుర్భాషలాడి కొట్టాడని మనస్తాపంతో డ్రైవర్ మధు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆ జడ్జిలకు ఆహ్వానం

అయితే, మధు మృతదేహంతో ట్రాక్టర్ యజమాని వెంకటకృష్ణారెడ్డి ఇంటి ముందు మృతుడి బంధువుల ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలతో చర్చించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles