Friday, May 17, 2024

గురుకుల అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ఈనెల 24న కౌన్సిలింగ్

spot_img

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ లోని వనపర్తి, కరీంనగర్ అగ్రికల్చర్ మహిళా కాలేజీల్లో బిఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 24న రాజేంద్ర నగర్ లో ని అగ్రికల్చర్ యూనివర్సిటీ లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు సోసైటీ  కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు.

Also Read.. ఈనెల 20, 21 తేదీలలో ఓటర్ నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్

ఎంసెట్ –2023లో ఉత్తీర్ణత సాధించిన వారు కౌన్సిలింగ్ కు హాజరుకావాలని, ఎంసెట్ లో వచ్చిన ర్యాంక్ తో పాటు గురుకుల అగ్రికల్చర్ డిగ్రీ కాలేజ్ సీట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారే ఈ  కౌన్సిలింగ్ కు హాజరుకావాలని ఆయన సూచించారు. కౌన్సిలింగ్ వివరాలు, ఖాళీ సీట్ల సంఖ్య కేటగిరీల వారీగా వెబ్ సైట్  (https://mjptbcwreis.telangana.gov.in) లో పొందుపరినట్టు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం అన్ని సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

Latest News

More Articles