ఒడిశా రాష్ట్రంలో కంధమాల్ జిల్లాలోని బ్రాహ్మిణిగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులోని యాత్రికుల్లో 32 మందికి గాయాలయ్యాయని, బాధితులంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్కు చెందిన 50 మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో టూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.