Friday, May 3, 2024

కార్గిల్‌లో 5.5 తీవ్రతతో భూకంపం

spot_img

న్యూఢిల్లీ: లడఖ్‌లోని కార్గిల్‌లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.5 గా నమోదైనట్లు పేర్కొంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు తెలిపింది.

కాగా, భూకంప ప్రభావం వల్ల ఉత్తర భారత్‌లోని పలు ప్రాంతాలతోపాటు  పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ సహా ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. అయితే ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు.

Latest News

More Articles