Friday, May 3, 2024

ఈ నెల 22న ఎల్.బి.స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు

spot_img

హైదరాబాద్:  ఈ నెల 22న ఎల్.బి.స్టేడియంలో క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం నిర్వహించనున్నది. ఇందులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొంటారని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కాంతి వెస్లీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం ఆనవాయితిగా ప్రభుత్వం తరపున కార్పొరేషన్ ఈ వేడుకలను నిర్వహిస్తుంది. ఈ వేడుకలలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

Latest News

More Articles