Friday, May 3, 2024

బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు

spot_img

జూబ్లీహిల్స్‌: బిగ్‌బాస్‌ సీజన్‌ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. బిగ్ బాస్ ఫైనల్ వేదికయిన ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు రెచ్చిపోయారు.

అమర్‌దీప్‌ కారుతోపాటు ఐదుకు పైగా ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే పోలీస్ బస్సు అద్దాలను పగులగొట్టారు. దీంతో గంటలకొద్ది ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ సంఘటనపై రెండు వేర్వేరు కేసులను నమోదు చేశామని, పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా ర్యాలీని నిర్వహించినందుకు పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర ప్రసాద్‌ వెల్లడించారు.

Latest News

More Articles