న్యూఢిల్లీ: 2023 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జొమాటో, స్విగ్గీ తదితర సంస్థల ద్వారా 65 లక్షల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఆర్డర్లు నమోదు అయ్యాయి. 2022 నూతన సంవత్సర వేడుకల కంటే ఇది 18 శాతం అధికమని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తన నివేదికలో వెల్లడించింది.
Also Read.. పాస్పోర్ట్ ర్యాంకులు: ఇండియా స్థానం ఎంతో తెలుసా?
అదే విధంగా సంవత్సరంలోని ఇతర రోజులతో పోలిస్తే రోజు సగటు ఆర్డర్ విలువ (AOV) కనీసం 30 శాతం ఎక్కువగా ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఐపీఎల్, క్రికెట్ వరల్డ్ కప్లు, దీపావళి, న్యూఇయర్ వంటి స్పైక్ డేస్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలకు కీలకమని, ఆయా సందర్భాల్లో కస్టమర్లు ఆన్ లైన్ ఆర్డర్లకు అధిక ఆసక్తి చూపుతారని రెడ్సీర్లో అసోసియేట్ పార్టనర్ అభిజిత్ రౌత్రే అన్నారు.