Thursday, May 2, 2024

రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది

spot_img

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని, సేకరించిన ధాన్యానికి 1000 కోట్ల రూపాయలను రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, రైతుబంధు అందరికి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి చెబుతుండగా.. సంక్రాంతి తర్వాత రైతులకు రైతుబంధు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారని పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Also Read.. కరీంనగర్ డిపోలో కోడిపుంజు వేలం.. అధికారుల నోటీసులు

స్వార్థ రాజకీయం కోసం కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క రైతు రుణమాఫీ చేయలేదన్నారు. రైతులకు సాగునీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వదా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో హామీలను తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. మిర్చి క్రయ, విక్రయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర రైతంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటును సరఫరా చేసిందని ఆయన తెలిపారు.

Latest News

More Articles