Sunday, May 5, 2024

కరీంనగర్ డిపోలో కోడిపుంజు వేలం.. అధికారుల నోటీసులు

spot_img

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ లో కోడిపుంజు వేలం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. గత 4 రోజులుగా కరీంనగర్ బస్టాండ్ డిపో 2లో ఓ కోడిపుంజు బందీగా ఉన్నది. వరంగల్ నుండి వేములవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సు.. కరీంనగర్ బస్టాండుకు వచ్చిన తరువాత బస్సులో ఓ సంచీని డ్రైవర్ గుర్తించారు.

Also Read.. బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ ను ఎదుర్కోవడం ఓ లెక్కా?

ఆ సంచీలో కోడిపుంజు ఉండటంతో కంట్రోలర్ కు అప్పగించారు. గత నాలుగు రోజులుగా డిపోలో ఓ జాలీలో పుంజును అధికారులు బంధించారు. పుంజు కోసం ఎవరూ రాకపోవడంతో రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు కోడిపుంజును బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Latest News

More Articles