భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 71.16 శాతం ఓటింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్లోని మొత్తం 230 స్థానాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read.. భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్: 2 లక్షలు దాటిన హోటల్ రూం టారిఫ్లు
అదేవిధంగా ఛత్తీస్గఢ్లో రెండో విడతలో భాగంగా 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఛత్తీస్గఢ్లోని మొత్తం 90 స్థానాలకుగాను ఈ నెల 7న తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మిగత 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ లో 68.15 శాతం పోలింగ్ నమోదైంది.