న్యూఢిల్లీ : క్రికెట్ వరల్డ్ కప్ తుది అంకానికి చేరింది. అహ్మదాబాద్లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే రోజు హోటల్ రూంలకు డిమాండ్ పెరిగింది. మ్యాచ్ జరిగే రోజు నైట్ స్టేకు అహ్మదాబాద్లోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్లో రూం టారిఫ్స్ ఏకంగా రూ 2 లక్షలు పలుకుతున్నాయి. ఇక ఇతర హోటల్స్ సైతం తమ టారిఫ్స్ను ఐదు నుంచి ఏడు రెట్లు పెంచేశాయి.
Also Read.. ఎవడికో ఓటు వేసి అభివృద్ధిని నాశనం చేసుకోవద్దు
వరల్డ్ కప్ ఫైనల్కు భారత్ నుంచే కాకుండా దుబాయ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల నుంచి కూడా ప్రేక్షకులు తరలివస్తున్నారు. దీంతో అహ్మదాబాద్లో త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్ కు క్రికెట్ అభిమానుల తాకిడి పెరిగింది. స్టేడియం కెపాసిటీ 1.2 లక్షల మంది కాగా.. 30,000 నుంచి 40,000 మంది వరకూ ఇతర ప్రాంతాల నుంచి మ్యాచ్ను వీక్షించేందుకు వస్తారని అంచనా వేస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ గుజరాత్ అధ్యక్షుడు నరేంద్ర సోమాని తెలిపారు.