తెలంగాణలో గణతంత్ర దినోత్సవంను ఈసారి నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ జెండా ఎగరవేశారు. అనంతరం వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళసై. భారతీయులు, భారత దేశం విజయవంతంగా ముందుకు వెళ్లడం మనకు చాలా గర్వకారణంగా ఉందన్నారు. రాజ్యాంగం కోసం క్రుషి చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆమె మాటలు వింటుంటే నాకు జాలేస్తుంది..బొత్స కామెంట్స్ ..!!