అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. చికాగోలోని జోలియెట్ పట్టణంలో ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది దుర్మరణం పాలయ్యారు. ఆదివారం, సోమవారాల్లో రెండు వేర్వేరు ఇళ్లలో దుండగులు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రోమియో నాన్స్ గా గుర్తించామని చెప్పారు. మరణించిన వారితో అతడికి పరిచయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఒకరి అదివారం చంపగా మిగిలిని 7గురిని సోమవారం చంపినట్లు పోలీసులు నిర్దారించారు. నిందితుడు రెడ్ కలర్ టయోటా కారులో తప్పించుకుని తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి గురించి ఎవరికైనా సమాచారం తెలుస్తే వెంటనే చేయాలని విజ్నప్తి చేశారు.
ACTIVE INCIDENT (UPDATED) JANUARY 22, 2024 3:00 PM
At this moment, Detectives and Officers are conducting an active homicide investigation after Officers located multiple deceased individuals who had sustained gunshot wounds in two homes in the 2200 block of West Acres Road. pic.twitter.com/zOTKSjs0RC— Joliet Police Department (@JolietPolice) January 22, 2024
జోలియట్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం ముందు ఫేస్బుక్ పోస్ట్లో పలువురు వ్యక్తులు హత్యకు గురయ్యారని తెలిపారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందన్నారు. పోలీసులు అనుమానితుడి ఫోటో, రెడ్ కలర్ టయోటా కారు ఫోటోలను షేర్ చేశారు. విల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం కూడా అదే కారు ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేసింది. ఆదివారం మధ్యాహ్నం రెండు వేర్వేరు కాల్పుల దృశ్యాలలో ఈ కారు కనిపించిందని పేర్కొంది.