తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుదునగర్ జిల్లాలోని కమ్మపట్టి గ్రామంలోగల ఓ పటాసుల కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీ నుంచి అరుపులు వినిపించాయి. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇంతలోనే ఫ్యాక్టరీలో మరో పేలుడు జరిగింది.
విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఘటనా ప్రాంతం నుంచి ఐదు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. కాలిన గాయాలైన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారిలో నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 9 కి పెరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి:నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్