ఆదర్శనీయుడు… యుగ పురుషుడు ఎన్టీఆర్ అని మంత్రి తలసాని కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వదెగ్గర ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు మంత్రి తలసాని.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ‘రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న మహనీయులు ఎన్టీఆర్.
చరిత్రలో ఎన్నటికీ మరువలేని మహామనిషి ఎన్టీఆర్ తెలుగుజాతి గొప్ప తనాన్ని యావత్ ప్రపంచానికి చాటిన గొప్ప నేత. ఎన్టీఆర్ శతజయంతిని నేడు ఎంతో ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది’ అని చెప్పారు తలసాని.