Saturday, May 18, 2024

తార్నాకలో బీఆర్ఎస్ కార్మిక విభాగం బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

spot_img

పార్లమెంట్ లో సీఎం కేసీఆర్ పై, తెలంగాణ సర్కారుపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్​లోని తార్నాకలో బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ రైతాంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సిఎం కేసీఆర్ దేనని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రైతులు దిక్కులు చూస్తే.. సీఎం కేసీఆర్ దీక్షా దక్షతతో అన్నదాతలకు ఆత్మగౌరవం పెరిగిందన్నారు.

24 గంటల కరెంటు పై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలు తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఏ అంశంలోనూ మాట్లాడలేక అన్నదాతలను రెచ్చగొట్టేందుకు పూనుకుంటున్నారని అన్నారు మోతె శోభన్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఉద్యమం జీవితం, ఆయన కష్టాలను తెలంగాణ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. అనుచిత వ్యాఖ్యలతో పబ్బం గడుపుకోవాలని చూసే పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు.

Latest News

More Articles