పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని ప్రసిద్ధ సందర్శనీయ ప్రదేశమైన ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈఫిల్ టవర్ మూడు అంతస్తుల్లో ఉన్న సందర్శకులను ఫ్రాన్స్ పోలీసులు ఖాళీ చేయించారు. అనంతరం బాంబు స్క్వాడ్, పోలీసులు కలిసి ఈఫిల్ టవర్ అంతటా తనిఖీలు చేపట్టారు.