Sunday, May 19, 2024

కాంగ్రెస్ మాటలు విని మోసపోవద్దు.. ఓటేసి గోస పడవద్దు

spot_img

నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మాట దేవుడెరుగు, వాళ్లు గెలిస్తే ఆరు నెలలకు ఒకరు ముఖ్యమంత్రి అవుతారని మంత్రి హరీష్ రావు అన్నారు. నిజామాబాద్ మాణిక్ బండారు రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మంచిది. అలాగే తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కరువు లేదు కర్ఫ్యూ లేదు. 9 ఏళ్ల కాలంలో సుభిక్షమైన పరిపాలన అందించామని తెలిపారు.

Also Read.. వీరు చెలరేగితే.. ప్రపంచ కప్ భారత్ దే

ఎన్నికలప్పుడొచ్చి ఆగమాగం చేసే పార్టీలను నమ్మవద్దు. వారి మాటలు విని మోసపోవద్దు.. ఓటేసి గోస పడవద్దు. మరోసారి పెద్ద మనసుతో ఆశీర్వదించండి. ప్రజా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా.. ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పక్కా అని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Latest News

More Articles