హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిపై తమిళనటుడు మన్సూర్ అలీ ఖాన్ పరువు నష్టం దావా వేశారు. మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు తెలిపారు. అలాగే త్రిష, ఖుష్బూలపై కూడా పరువు నష్టం దావా వేసాడు మన్సూర్ అలీ ఖాన్.
Also Read.. రాష్ట్రంలో పెరుగుతున్న ఊబకాయుల సంఖ్య. కారణం ఇదేనట!
నటి త్రిషపై మన్సూర్ అలి ఖాన్ అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను చిరంజీవి, ఖుష్బూ తీవ్రంగా ఖండించారు. బేషరతుగా త్రిషకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, నిజాలు తెలుసుకోకుండా తనను బ్లేమ్ చేసారని ఆరోపిస్తూ మన్సూర్ అలీ ఖాన్ వారిపై పరువు నష్టం దావాలు దాఖలు చేశారు.