హైదరాబాద్: ఫిలిం నగర్ పరిధిలో దారుణం జరిగింది. అప్పు తీర్చలేదని భార్యా భర్తలను దారుణంగా హత్య చేశారు నిందితులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యా కాలనీలో ఉండే ఖాద్రీ, ఫాతిమా దంపతులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఫిలిం నగర్ పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read.. జాతీయస్థాయిలో దుమారం రేపుతున్న సీఎం రేవంత్ రెడ్డి ‘డీఎన్ఏ’ కామెంట్స్!