Wednesday, May 1, 2024

ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం

spot_img

హైదరాబాద్: తెలంగాణ మూడవ శాసన సభకు ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసారు చంద్రయాణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. ఇవాళ ఉదయం 8:30 గంటలకు రాజ్ భవన్ దర్బార్ హాల్ లో అక్బరుద్దీన్ చేత రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Also Read.. మెగాస్టార్ చిరంజీవిపై పరువు నష్టం దావా

ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యే లు హాజరు అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుండి హాజరైన పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. అనంతరం ప్రొటెం స్పీకర్ హోదాలో అక్బరుద్దీన్ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

Latest News

More Articles