Saturday, May 18, 2024

దర్శకుడు ఆర్జీవీపై బర్రెలక్క ఫిర్యాదు

spot_img

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు వరుస షాకులు తగులుతున్నాయి. రాంగోపాల్ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమాను ఈ రోజు విడుదల కాకుండా హైకోర్టు అడ్డుకుంది. అది జరిగిన కాసేపటికే ఆయనకు మరో షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బర్రెలక్క అలియాస్ శిరీష.. ఆర్జీవీ మీద మహిళా కమిషన్‌కు పిర్యాదు చేసింది.

Read Also: పిల్లల్ని కనడానికి వ్యక్తికి 4 వారాల పెరోల్ ఇచ్చిన కోర్టు

వ్యూహం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆర్జీవీ.. తనను కించపరిచేలా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొంది. ‘ఊరు పేరు లేని ఆవిడ బర్రెలక్కగా చాలా ఫేమస్ అయింది. బర్రెలను కాసే ఓ అమ్మాయి అంత పాపులర్ అయిపోతే.. పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేకపోతున్నాడు’ అని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు తనను అవమానపరిచేలా ఉన్నాయని ఆమె మహిళా కమిషన్‌కు చేసిన పిర్యాదులో పేర్కొంది.

Latest News

More Articles