హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో నిన్న (ఆదివారం)భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. ఓ విదేశీ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ. 41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు
నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు. హెరాయిన్ను డాక్యుమెంట్ ఫోల్డర్లో దాచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అక్రమంగా బంగారం, డ్రగ్స్ తరలిస్తున్న క్రమంలో విమానాశ్రయాల్లో తనిఖీలను కట్టుదిట్టం చేశారు అధికారులు.
ఇది కూడా చదవండి: రామమందిరం ప్రాణ ప్రతిష్ట… హైదరాబాద్ లో హై అలర్ట్