Sunday, May 19, 2024

తోపుడు బండ్ల వ్యాపారులపై జీహెచ్ఎంసీ ప్రతాపం..!

spot_img

దుర్గం చెరువు వద్ద తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటున్న వారిపై ప్రతాపం చూపించాడు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ స్నేహ షబరిష్. ఉదయం దుర్గం చెరువు వద్ద శేరిలింగంపల్లి జోనల్ అధికారులతో శానిటేషన్ మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన కమిషనర్ రోనాల్డ్ రోస్.

దుర్గం చెరువు వద్ద తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకుంటున్న వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి పోవాలని ఆదేశాలు ఇచ్చారు జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్. మిగిలిన తోపుడు బండ్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జోనల్ టాస్క్ ఫోర్స్ తో పూర్తిగా ధ్వంసం చేపించారు కమిషనర్ స్నేహ శబరీష్.

Latest News

More Articles