Friday, May 17, 2024

100 రోజులలో గ్యారంటీలు అమలు పరచాలి.. లేకపోతే బొందపెట్టుడు ఖాయం

spot_img

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి ఆగవద్దు అని జీహెచ్ఎంసి పరిధిలో అన్ని సీట్లు గెలిపించారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని జిల్లాలలో కాంగ్రెస్ మోసపూరిత మాటలు వలన గెలవలేకపోయామని, అధికారం పోయింది అనే బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు మనకు కొత్త బాధ్యత ఇచ్చారని, ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించమన్నారు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులుకు పొద్దునే లేచి మనల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 100రోజులు గ్యారంటీలు అమలు పరుస్తాం అని చెప్పారు, నేరవేర్చకపోతే వాళ్ళని బొంద పెడుదామని పిలుపునిచ్చారు.

‘‘కేసీఆర్ సంక్షేమం అందిస్తూనే, అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ వాళ్ళు రాగానే కరెంట్ పోతుంది. బస్సులో సీట్లు కోసం మహిళలు కొట్టుకుంటున్నారు. ఆటో తగలబెట్టి ప్రభుత్వం తమ కడుపు కొట్టింది అని ఆటో అన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 420 హామీలు అమలు పరచాలి లేకపోతే ఊరుకోనేది లేదు. ప్రజలు ఎవరు బాధపడల్సిన అవసరం లేదు. మీ గొంతుని వినిపించడం కోసం మేము ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలు గెలవాలి. మనం గనుక పార్లమెంట్ లో లేకపోతే, మన హక్కులు గురించి మాట్లాడే వారు ఎవరు ఉండరు. తెలంగాణ ప్రజలు గళం బిఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ను బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికలు కాకుండా అన్ని ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీనే గెలిపించాలి. 12సీట్లు కు తగ్గకుండా పార్లమెంట్ సీట్లలో మనం గెలుస్తే కాంగ్రెస్ పైన ఒత్తిడి మరింత పెరుగుతుంది.’’ అని అన్నారు.

Also Read.. భద్రాద్రి ఊపిరి పీల్చుకో.. భవిష్యత్ మనదే..!

Latest News

More Articles