టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత ముగిసింది. అయినప్పటికీ ద్రవిడ్, సపోర్టింగ్ స్టాఫ్ కొనసాగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ మరెంతకాలం కొనసాగుతాడన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. దీంతో బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించారు. ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు ద్రవిడ్ కొనసాగుతాడని ఆయన చెప్పారు.
గతేడాది ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్, సపోర్ట్ స్టాఫ్ కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ డిసెంబర్-జనవరిలో జరగనున్న సౌతాఫ్రికా టూర్ వరకు కొనసాగాలని బీసీసీఐ కోరింది. అయితే అది ఎంతకాలం అన్నది మాత్రం అప్పుడు చెప్పలేదు. ద్రవిడ్తో తాను మాట్లాడానని వెస్టిండీస్-అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగాలని కోరినట్టు జైషా తెలిపారు. ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్ వెంటనే సౌతాఫ్రికా టూర్కు వెళ్లడంతో అప్పుడు మాట్లాడడం కుదరలేదని.. అదిప్పుడు జరిగిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: మూడు నెలలు చికెన్ షాపులు బంద్