తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకమయ్యారు. చైర్మన్తో పాటు కమిషన్ సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుదీర్రెడ్డి, నెహ్రూనాయక్ మాలోత్ను నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ(శుక్రవారం) ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ చైర్మన్తో పాటు సభ్యులు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
సిరిసిల్ల రాజయ్య వరంగల్ (ఎస్సీ) పార్లమెంట్ స్థానం నుంచి 15వ లోక్సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: కాంట్రాక్ట్ ముగిసినా కోచ్గా కొనసాగుతున్నరాహుల్ ద్రవిడ్