Sunday, May 19, 2024

ఘోరరోడ్డు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..నలుగురు దుర్మరణం.!

spot_img

ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది.కాకినాడ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు దగ్గర ఉన్న పాదాలమ్మ గుడి దగ్గర 16వ నెంబర్ జాతీయరహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఓ లారీకి పంచర్ అవ్వడంతో నలుగురు వ్యక్తులు టైర్ మారుస్తుండగా..అదే సమయంలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అతివేగంతో దూసుకువచ్చింది. టైరు మారుస్తున్న వారిపై దూసుకెళ్లింది. ఆకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. నలుగురు అక్కడిక్కడే మరణించారు. చనిపోయినవారిలో దాసరి కిషన్, దాసరి ప్రసద్, రాజు, నాగయ్యలు ఉన్నారు. ఈ నలుగురిలో రాజు అనే వ్యక్తి ప్రత్తిపాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మిగిలిన ముగ్గురు బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు చెందినవారు గా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా  చదవండి: నాకూ నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే అంటున్న ఆ రాష్ట్ర సీఎం.!

Latest News

More Articles