Saturday, May 18, 2024

 అల్వాల్‌లో డీసీఎం వ్యాన్‌ ఢీ కొని బాలుడి మృతి

spot_img

సికింద్రాబాద్‌ అల్వాల్‌లో ఇవాళ(గురువారం) మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ చిన్నారి చనిపోయాడు. అల్వాల్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌కు సరకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా నడుచుకుంటూ వెళ్లే వారి పైకి దూసుకొచ్చింది. అదే సమయంలో తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తోన్న తిరుపాల్‌ (9)ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.  డీసీఎం వ్యాను డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదంలో చనిపోయిన తిరుపాల్..అల్వాల్‌ గంగపుత్ర కాలనీకి చెందివాడుగా గుర్తించారు. కృష్ణవేణి స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తండ్రిని చూసేందుకు తల్లితో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి:వాట్సాప్ యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్

Latest News

More Articles