ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్ యాప్’ త్వరలో యూజర్లకోసం సరికొత్త ఫీచర్ ను తీసుకురానుంది. ఏఐ టెక్నాలజీ ఆధారిత ఫీచర్ ద్వారా యూజర్ల ఫిర్యాదు, అనుమానాలను సత్వరమే పరిష్కరించబోతోంది. ఈ మేరకు నూతన ఫీచర్పై వాట్సాప్ పనిచేస్తోందని ‘వాబెటాఇన్ఫో’ రిపోర్ట్ తెలిపింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్ల ఫిర్యాదులు, ప్రశ్నలకు తక్షణ స్పందన లభించనుందని తెలిపింది. అన్ని వెర్షన్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని, పని గంటల తర్వాత కూడా యూజర్లకు ఏఐ ఫీచర్ పరిష్కారాలు లభించనున్నాయని వివరించింది. వేగంగా, సమయాన్ని ఆదా చేసే రీతిలో ప్రతిస్పందన ఉంటుందని వివరించింది.
ఇది కూడా చదవండి:విండోస్11 యూజర్లకు మైక్రోసాఫ్ట్ అలర్ట్