Sunday, May 19, 2024

విండోస్11 యూజర్లకు మైక్రోసాఫ్ట్ అలర్ట్

spot_img

విండోస్11 యూజర్ల ను గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అలర్ట్ చేసింది. విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లకు ముగింపు పలకబోతున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 31, 2024తో నిలిచిపోనున్నాయని తెలిపింది. యూజర్లు ‘మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్’ యాప్‌‌ వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వివరించింది. కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికలో ఈ మార్పు భాగంగా ఉందని, ‘ఆఫీస్ 365’ టూల్స్ లో భాగంగా ‘ఔట్ లుక్’ యాప్‌ సర్వీసును అందించనున్నట్టు తెలిపింది.

దీంతో రోజువారీ కార్యకలాపాల కోసం విండోస్ 11 మెయిల్, క్యాలెండర్ యాప్‌లపై ఆధారపడుతున్నవారు డిసెంబర్ 31, 2024లోపు ‘ఔట్‌లుక్’లోకి మారాల్సి ఉంటుంది. పాప్-అప్ నోటిఫికేషన్ల ద్వారా యూజర్లకు సులభతరం చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. అయితే కటాఫ్ తేదీ వరకు సర్వీసులను యూజర్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా పొందొచ్చని కంపెనీ వివరించింది. కాగా 2024 ఆరంభం నుంచి మార్కెట్‌లోకి వచ్చే కొత్త విండోస్ 11 పరికరాల్లో మెయిల్ అప్లికేషన్‌గా డిఫాల్డ్ గా ఇన్‌స్టాల్ చేసి ఉంటుందని తెలిపింది. కాగా పాత విండోస్ 11కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ ఉండవని వివరించింది.

ఔట్‌లుక్ వెబ్ అప్లికేషన్ యూజర్లు అధునాతన ఫీచర్లను అందిస్తోంది. ఇది వేగంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుంది. ఈ-మెయిల్ సేవలతో పాటు ‘మై డే’ సెక్షన్‌లో సమగ్రమైన క్యాలెండర్, చేయాల్సిన పనుల లిస్టింగ్‌కు ఫీచర్‌ లభించనున్నాయి. ఔట్‌లుక్‌ లో జీ-మెయిల్, యాహూ వంటి ప్రొవైడర్ల ద్వారా థర్డ్ పార్టీ ఈ-మెయిల్ అకౌంట్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: పాకిస్తాన్ లో మళ్లీ ఉగ్రదాడి.. నలుగురు పోలీసులు మృతి

Latest News

More Articles