Monday, May 6, 2024

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ

spot_img

రోహిత్ శర్మ మాత్రం టీమిండియా టాప్ బ్యాట్స్‌మెన్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 13, సెకండ్ ఇన్నింగ్స్‌‌లో 14 పరుగులు చేసిన రోహిత్.. ఈ స్కోర్స్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీని అధిగమించాడు. ఇక డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో 48 సగటుతో 2242 పరుగులు చేశాడు. వీటిలో 7 సెంచరీలు, 6 ఆర్థ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు కోహ్లీ 36 టెస్టుల్లో 39 సగటుతో 2235 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు. కోహ్లీ తొలి రెండు టెస్టులు ఆడకపోవడంతో రోహిత్ విఫలమైనా.. టాప్‌లో ఉన్నాడు. కోహ్లీ మిగిలిన టెస్టుకు దూరం కావడంతో.. రోహిత్ మరింత ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది.

ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్ లో సీనియర్ ప్లేయర్లు చితేశ్వర్ పూజారా(1769), అజింక్య రహానే(1589) పరుగులతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇక యాక్సిడెంట్ కారణంగా ఏడాది పాటు టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉన్న వికెట్ కీపర్ రీషబ్ పంత్ 1575 పరుగుతలో ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇది కూడా చదవండి:పెళ్లికి ఒప్పుకోలేదని రోడ్డుపై నరికి చంపాడు

Latest News

More Articles