నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. ఖానాపూర్ పరిధిలోని శివాజీనగర్లో నడిరోడ్డుపై ఓ ప్రేమికుడు తన ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని గొడ్డలితో నరికిచంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇది కూడా చదవండి: ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకు అండగా బీఆర్ఎస్