Saturday, May 4, 2024

హైటెక్స్ లో జీఎస్‌ఐ ఎక్స్ పో 2024 ప్రదర్శన ప్రారంభం

spot_img

జీఎస్‌ఐ ఎక్స్ పో 2024కు హైదరాబాద్‌ వేదికగా మారింది. ఎక్స్ పో గెలాక్సియా ఆధ్వర్యంలో హెటెక్స్ లో గిష్ట్‌ అండ్‌ స్టేషనరీ ఇండియా 2024 పేరుతో మూడు రోజుల పాటు ప్రదర్శన జరుగుతుంది. హెటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో షురూ అయిన ఎక్స్‌పోలో దేశ విదేశాలకు చెందిన పలు బ్రాండింగ్‌ కంపెనీలు వచ్చి ఈ ఎక్స్ పో లో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు ఎక్స్ పో గెలాక్సియా ఇంచార్జ్‌ రాఖీ ముఖర్జీ తెలిపారు. స్వచ్చంద సంస్థ ది కార్పొరేట్‌ గిఫ్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీజీఏఐ) కు చెందిన సభ్యులు ఈ ఎక్స్ పోలో పాల్గొంటున్నారు. ప్రతీ ఏటా రూ.4వేల కోట్ల విలువల ఇండియన్‌ స్టేషనీ ఇండస్ట్రీలో వచ్చిన విప్లవాత్మకమైన ప్రాడక్ట్ లు, కొత్త బ్రాండ్‌లన్నింటిని ఒక వేదిక మీదికి తీసుకువచ్చి ఈ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు.

ఈ ప్రదర్శనలో బ్రాండింగ్‌ మిషనరీలు, కెమెరాలు, హ్యాండీ క్రాప్ట్స్‌, నావెల్టీస్‌, ఫోటో ఫ్రేమ్స్‌, కంప్యూటర్‌, మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ , గిఫ్ట్‌ హ్యాంపర్స్‌, డెకోరేటివ్‌ ఐటమ్స్‌, కాస్టూమ్స్‌, స్కూల్‌, కాలేజీలు, ఆఫీస్‌లకు సంబంధించిన స్టేషన్‌లతో పాటు జర్నల్స్‌, ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఒక్క తెలంగాణలోనే 230 మిలిన్‌ డాలర్ల ఐటీ, సాఫ్ట వేర్‌ , బ్యాంకింగ్‌, ఫార్మా , అగ్రికల్చర్‌ కార్పొరేట్‌ గిఫ్ట్‌ బిజినెస్‌ జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రంగా 500లకు పైగా ఐటీ కంపెనీలు, ఎంఎన్‌సీ కంపెనీలు, అదే విధంగా 2400 ఫార్మా కంపెనీలు ఉండడంతో కార్పొరేట్‌ గిఫ్ట్‌, స్టేషనరీ వ్యాపారం జరుగుతోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఎక్స్ పో గెలాక్సియా ప్రతినిధి రాఖీ ముఖర్జీ తెలిపారు.

ఇది కూడా చదవండి:వాట్సాప్ యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్

Latest News

More Articles