Sunday, May 19, 2024

చార్మినార్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

spot_img

హైదరాబాద్: చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఆయన కుమారుడు ఇంతియాజ్ పై కేసు నమోదైంది. వారిపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు మొఘల్ పుర పోలీసులు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, అనుమతి లేకుండా 200మంది అనుచరులతో ర్యాలీ చేపట్టారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. పోలీసులు తమను అకారణంగా వేధిస్తున్నారంటూ ఇంతియాజ్ ఆరోపించారు.

Also Read.. హైదరాబాద్‌ మెట్రో నయా రికార్డు

Latest News

More Articles