Sunday, May 19, 2024

చరిత్ర సృష్టించిన మ‌హిళ‌ల హాకీ జ‌ట్టు.. పైనల్లో జపాన్ చిత్తు

spot_img

న్యూఢిల్లీ : ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భార‌త మ‌హిళ‌ల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. రాంచీలో ఆదివారం జ‌రిగిన టైటిల్ పోరులో జ‌పాన్‌పై 4-0తో గెలుపొంది.. రెండోసారి చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. మ‌రంగ్ గొమ్కే జైపాల్ సింగ్ అస్ట్రో ట‌ర్ఫ్ హాకీ స్టేడియంలో జ‌రిగిన ఫైన‌ల్లో భార‌త ప్లేయ‌ర్లు  సంగీత కుమారి(17వ నిమిషం), నేహా గోయ‌ల్(46), ల‌ర్లెమ్‌సియామి(57), వంద‌నా క‌టారియా(60)లు త‌లొక గోల్ చేయ‌డంతో టీమిండియా అల‌వోక‌గా గెలుపొందింది.

Also Read.. కైరో థెరపీ తీసుకుంటున్న సమంతా

భార‌త జ‌ట్టు 2016లో మొద‌టిసారి చాంపియ‌న్‌గా నిలిచింది. సింగ‌పూర్‌లో జరిగిన ఫైన‌ల్లో చైనాను 2-1తో ఓడించి ట్రోఫీని ముద్దాడింది. మూడో స్థానం కోసం జ‌రిగిన పోటీలో చైనా 2-1తో ద‌క్షిణ‌ కొరియాను చిత్తు చేసింది.

Latest News

More Articles