హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డును నమోదు చేసింది. ఒక రోజులో ప్రయాణం చేసే మెట్రో ప్రయాణికుల సంఖ్యలో రికార్డు స్థాయిలో వృద్ధి నమోదైంది. మెట్రో సేవలు ప్రారంభమైన ఆరేండ్లలో ఒకేరోజు 5.47 లక్షల మంది మెట్రో మార్గాల్లో రాకపోకలు సాగించారు.
Also Read.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాలుగు చోట్ల సీఎం కేసీఆర్ సభలు
నగరంలో ఐటీ కార్యకలాపాలతో పాటు దసరా, దీపావళి సీజన్ల తో సందడి నెలకొని ఉండటంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా కారిడార్-3లో రద్దీ అధికంగా ఉంటున్నదని, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా మెట్రో రైళ్లలోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు తెలిపారు.