హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. దేవరకద్ర, గద్వాల్, మక్తల్, నారాయణ పేట నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Also Read.. వీడియో: నిప్పులు కురిపించిన ఆర్మీ హెలికాప్టర్ రుద్ర
బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రజా ప్రతినిధులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరానున్నారు. సీఎం కేసీఆర్ సభల కోసం స్థానిక నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసారు. మొదటి సభ మధ్యాహ్నం 12 గంటలకు దేవరకద్రలో ప్రారంభం అవుతుంది. అనంతరం సీఎం కేసీఆర్ గద్వాల్, మక్తల్,నారాయణ పేట సభలలో పాల్గొంటారు.