Sunday, May 12, 2024

కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్

spot_img

హైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ రాజా రమేష్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజరమేష్ మాట్లాడుతూ.. సింగరేణిలో వైద్యుడిగా 15 సంవత్సరాలు సేవలందించి పేద బడుగు బలహీన వర్గాలకు 23 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నానని తెలిపారు. అస్తిత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి చెన్నూర్ నియోజకవర్గంలో జీవం పోసానన్నారు.

Also Read.. రండి చూసుకుందాము.. ఢిల్లీ దొరలకు కేటీఆర్ సవాల్

పలుమార్లు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఒక వ్యాపారవేత్త కు చెన్నూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలికిందని, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి పార్టీ కోసం పనిచేసిన జెండాలు మోసిన కార్యకర్తలను కాంగ్రెస్ అధిష్టానం మోసం చేసిందని తెలిపారు. వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతూ డబ్బు సంచులతో పార్టీలు మారుతూ పోటీ చేసే అభ్యర్థులు కార్పొరేట్ రాజకీయాలు చేస్తారు తప్ప ప్రజలకు తాము పోటీ చేసిన పార్టీకి జెండా మోసిన కార్యకర్తలకు న్యాయం చేయరన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.

Latest News

More Articles