Saturday, May 11, 2024

రండి చూసుకుందాము.. ఢిల్లీ దొరలకు కేటీఆర్ సవాల్

spot_img

షాద్ నగర్: ఒక్క కేసీఆర్ ను ఓడగొట్టడానికి మహా మహులు దిగుతున్నారని, కానీ కేసీఆర్ ప్రజలను నమ్ముకున్నారని.. అందుకే వారు ధైర్యంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుందని, షేర్ ఖాన్, బబ్బర్ ఖాన్, తిస్మార్ ఖాన్ లు రండి చూసుకుందామని సవాల్ విసిరారు. నవంబర్ 30 నాడు ఢిల్లీ దొరలకు తమ ప్రతాపం చూపిస్తామన్నారు. ఆదివారం షాద్ నగర్ లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం తాత్సారం.. మోడీని నిలదీయాలి.. హరీష్ రావు పిలుపు

‘‘దొరల తెలంగాణ అంటారు.మీరు కాదా ఢిల్లీ దొరలు. రాహుల్ గాంధీ నీవు కాదా ఢిల్లీ దొరవు. అంజన్నా అంటే మీకోసం నేనున్నాను అనే నాయకుడు. కాంగ్రెస్, బిజెపికి ఇక్కడ సత్తా లేదు. అందుకే గుజరాత్, కర్ణాటక ల నుండి నాయకులను పిలిపించుకుంటున్నారు. ఇలాంటి సన్నాసులు మనకు కావాలా? ఇలాంటి భేకార్ గాళ్లు మనకు అవసరమా?

Also Read.. తెలంగాణీయులమే.. విద్వేషపూరిత వ్యాఖ్యలపై ‘గ్రేటర్ రాయలసీమ’ క్లారిటీ

పేదలలో ఆత్మ స్థైర్యం పెంచారు కేసీఆర్. కేసీఆర్ మాటిస్తే నిలబడతారు. 93 లక్షల కుటుంబాలకు ఐదు లక్షల బీమా అందుతది. 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తాము. సౌభాగ్య లక్ష్మి కింద నెలకి మూడు వేల రూపాయలు అందిస్తాము. పాలమూరు రంగారెడ్డి ద్వారా తాగు నీరు కూడా రాబోతుంది. మోడీ జన్ ధన్ ఖాతాలు తెరవండి 15 లక్షలు వేస్తా అన్నాడు..వేసాడా?

Also Read.. ఖమ్మం ప్రజలను గుత్త పట్టినారా? పొంగులేటి, తుమ్మలపై సీఎం కేసీఆర్ ఫైర్

సిలండర్ మీద పెరిగిన రూ.8 వందలను కేసీఆర్ భరించి రూ.400 వందలకు సిలిండర్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత కేసీఆర్ ది. షాద్ నగర్ కు ఐటి హబ్ తీసుకు వచ్చే బాధ్యత నాది. మనవారు ఎవరైనా అలిగితే…వారికి ఇలా చెప్పండి. గులుగుడు గులుగుడే…గుద్దుడు గుద్దుడే అని. 30 తారీకు నాడు కారు గుర్తుపై ఓటు వేయండి. ప్రతి తండాలో సేవాలాల్ భవనాలను కడతాం.’’ అని కేటీఆర్ తెలిపారు.

Latest News

More Articles