హైదరాబాద్: ప్రముఖ న్యాయవాది సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, చిట్లపల్లి మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మధుసూదన్ రెడ్డి ఇంటికి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వెళ్లి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Also Read.. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం తాత్సారం.. మోడీని నిలదీయాలి.. హరీష్ రావు పిలుపు
కొడంగల్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తానని ప్రకటించారు. మంత్రి వెంట సీనియర్ నాయకులు మధుసూదన్ యాదవ్, సహకార సంఘం చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, సర్పంచ్ కాశప్ప నరోత్తం రెడ్డి, రాహుల్ యాదవ్, నందరం పవన్ గుప్తా తదితరులు ఉన్నారు.