నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న కారును డీ కొట్టాడు. ఆ తర్వాత లారీ టోల్ ప్లాజా కౌంటర్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టోల్ ప్లాజా సిబ్బంది, కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్లోకి దూసుకెళ్లిన లారీని క్రేన్ సాయంతో తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇది కూడా చదవండి: ఇసుక బట్టి గోడ కూలి ఆరుగురు సజీవ సమాధి