Thursday, May 2, 2024

ప్యాసింజర్‌ రైల్లో అగ్నిప్రమాదం.. బోగీ దగ్ధం

spot_img

నాందేడ్‌: మహారాష్ట్రలోని నాందేడ్‌ రైల్వే స్టేషన్‌లో పూర్ణ-పర్లి ప్యాసింజర్‌ రైలులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లగేజ్‌ కమ్‌ గ్వార్‌ వ్యాన్‌ కోచ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ ఫైటర్స్‌ దాదాపు అరగంటపాటు శ్రమించి మంటలను ఆర్పేశారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే లోపే బోగీలోని లగేజ్‌, ఫర్నీచర్‌ దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Latest News

More Articles