హైదరాబాద్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసారని పోలీసులు తెలిపారు.
హత్యకు గురైన వ్యక్తి బిహార్ కు చెందిన ప్రజాపతిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. హత్యకు గురైన ప్రజాపతి నాచారంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.