Friday, May 17, 2024

రెడ్కో కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

spot_img

హైదరాబాద్ ఖైరతాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో) ప్రధాన కార్యాలయంలో 77వ స్వాంతంత్ర్యదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రెడ్కో వై.సతీష్ రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికి ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎందరో వీరుల త్యాగం ఫలితంగా నేడు మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, బాలాగంగాధర్ తిలక్, భగత్ సింగ్ వంటి ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు. స్వాతంత్ర్య వీరుల జీవిత చరిత్రలను రాబోయే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. స్వాంతంత్ర్యపోరాటస్పూర్తితోనే మన సీఎం కేసీఆర్, ఆనాటి ఉద్యమనాయకుడు కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. 60 ఏళ్లలో కోల్పోయిన అభివృద్ధిని 9 ఏళ్లలో సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడు తలసరి విద్యుత్ వినియోగం 1100 యూనిట్లుగా ఉంటే.. నేడు 2100 యూనిట్లకు పెరిగిందన్నారు. తలసరి ఆదాయం లక్షా 25 వేల నుంచి 3 లక్షల 8 వేలకు పెరిగిందని ఇది ప్రతీఒక్కరికి గర్వకారణమన్నారు.

స్వాతంత్ర్యం వచ్చి 76ఏళ్లు అవుతున్నా భరతమాతను పూజించే మనదేశంలో మహిళలపై అకృత్యాలు జరగడం బాధాకరమన్నారు వై.సతీష్ రెడ్డి. భారత కీర్తి పతాకాన్ని ప్రపంచవేదికలపై రెపరెపలాడించిన క్రీడాకారులు లైంగిక వేధింపులతో ఢిల్లీలో 6 నెలలుగా ఆందోళన చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మణిపూర్ లో యువతులను నగ్నంగా ఊరేగించడం దేశమంతా తలదించుకోవాల్సిన దారుణ ఘటన అన్నారు. ఇలాంటి ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. పిల్లల పెంపకంలోనూ తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి మంచి చెడులు నేర్పించాలని సూచించారు. ఎవరైనా వేధించినా ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పేలా పిల్లలతో స్నేహంగా మెలగాలని చెప్పారు.

Latest News

More Articles